New
Responsive image Responsive image

    *** ముఖ్య సూచనలు ***

  • ఉద్యోగి తన ఎంప్లాయి కోడ్ మరియు కంపెనీలో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబరు ద్వారా లాగిన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మొబైల్ నెంబరు కంపెనీలో (ఎస్ ఏ పీ) లో లేకపోయినా లేదా మొబైల్ నెంబరు మారినట్లయినా తక్షణమే గని / విభాగం లోని సంబంధిత అధికారి కి చెప్పి మొబైల్ నెంబరును అప్ డేట్ చేసుకున్న అనంతరమే లాగిన్ అవడానికి అవకాశం ఉంటుంది.
  • తిరుమలకు వెళ్లడానికి సరిగ్గా 30 రోజుల ముందు ఆన్లైన్ లో వసతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణానికి 10 రోజుల ముందు వరకు ఖాళీలను బట్టి దరఖాస్తుల స్వీకరించడానికి వెబ్ పోర్టల్ లో అవకాశం ఉంటుంది.
  • తీర్థ యాత్రకు సరిగ్గా వారం రోజుల ముందు రూం కన్ఫర్మేషన్ కు సంబంధించిన మెసెజ్ రిజిస్టర్డు మొబైల్కు పంపడం జరుగుతుంది.
  • మొదటగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన వారికి మొదటి ప్రాధాన్యంగా రూంల కేటాయింపు ఉంటుంది.
  • ఒక్కరిగా యాత్రకు వెళ్లే వారికి వసతి సౌకర్యం ఉండదు. కనిష్టం గా ఇద్దరు ఉండొచ్చు.
  • ఒక రూంలో గరిష్ఠంగా నలుగురు (పిల్లలతో కలిపి) ఉండొచ్చు.
  • ఉద్యోగి గరిష్టంగా రెండు గదుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కనిష్టంగా ఒక రోజు, గరిష్టంగా రెండు రోజుల వరకు మాత్రమే బస చేయడానికి అవకాశం ఉంటుంది.
  • ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుష్పగిరి మఠంలో రిపోర్టు చేయడానికి అవకాశం ఉంటుంది. చెక్ అవుట్ మాత్రం మరుసటి రోజు లేదా రెండో రోజు ఉదయం 9 గంటల వరకే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి పుష్పగిరి ట్రస్టు యాజమాన్యానికి సహకరించాలి.
  • వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ఒక గని / విభాగం నుంచి రోజులో గరిష్టంగా రెండు దరఖాస్తులను మాత్రమే స్వీకరించడం జరుగుతుంది.
  • ఒకసారి ఆన్లైన్ లో నమోదు చేసుకున్న వారు ఆరు నెలల(180 రోజుల) అనంతరం మళ్లీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనివార్య కారణాల వల్ల ఆన్లైన్ దరఖాస్తును 10 రోజుల ముందే క్యాన్సిల్ చేసుకున్న వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు.
  • ఎవరైనా ప్రయాణాలు రద్దు చేసుకుంటే వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి అవకాశం వస్తుంది.
  • తిరుమలలో రద్దీ పెరగడం, ఇతరత్రా ఏదైనా కారణాల వల్ల గదులు లభించని పరిస్థితులు తలెత్తినప్పుడు ఆన్లైన్ దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంటుంది.
  • ఉద్యోగులు కంపెనీ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే పుష్పగిరి మఠం నిర్వాహకులకు ఉద్యోగి తన కార్డును చూపించి నిర్దేశిత రుసుంను చెల్లించాలి.
  • ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన ఉద్యోగి పేరుతో ఇతరులు వెళ్లకూడదు. అలా వెళ్తే పుష్పగిరి మఠంలో గదులను కేటాయించడం జరగదు. కంపెనీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి.
  • ప్రతీ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా 3 రోజులు, వైకుంఠ ఏకాదశి సందర్భం 3 రోజులు, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 11 రోజులు ఆన్ లైన్ వసతి సదుపాయం ఉండదు.
  • పైన పేర్కొన్న నియమ నిబంధనలను అతిక్రమిస్తే సదరు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
    • *** ఉద్యోగుల తిరుమల ప్రయాణం సౌకర్యవంతంగా సాగేందుకు వీలుగా చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరుతూ..-సింగరేణి యాజమాన్యం ***